రాష్ట్రీయం
విశాఖ భూ కుంభకోణంపై సిట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 June 2017
విజయవాడ, జూన్ 12: విశాఖపట్నం భూకుంభకోణంపై సిఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణలపై సోమవారం రాత్రి జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పోలీసు, న్యాయ నిపుణులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ మధురవాడ, కొమ్మాది గ్రామాల్లో భూ ఆక్రమణలపై సిట్ దర్యాప్తుచేస్తుందని, ఆక్రమణలకు పాల్పడిన వారికి రాష్ట్రంలో స్థానం లేదని హెచ్చరించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విశాఖ కలెక్టర్ ప్రవీణ్కుమార్, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు, పలువురు పాల్గొన్నారు.