ప్రకాశం

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలటౌన్, జూన్ 12: వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు స్థానిక వైకుంఠపురానికి చెందిన మామిడి విశ్వనాధం(54) ఓ ప్రయివేటు పార్శిల్ కార్యాలయంలో నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. వైకుంఠపురం రైల్వేగేటు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా చీరాల-జాండ్రపేట స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతునికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతనికి సుమారు 60 సంవత్సరాలు వయసు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై జి రామిరెడ్డి తెలిపారు.