తెలంగాణ
21 నుంచి కోదండరామ్ అమరుల స్ఫూర్తి యాత్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 June 2017
హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ జెఎసి ఈ నెల 21న సిద్దిపేటలో ‘అమరుల స్ఫూర్తి యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నది. ఆ రోజున ఉదయం 7 గంటలకు నగరంలోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమర వీరుల స్థూపం వద్ద టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రభృతులు అమర వీరులకు నివాళి అర్పిస్తారు. అనంతరం వారు సిద్దిపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రారంభమై 24వ తేదీ వరకు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కొనసాగుతుంది. ఇది మొదటి దశ మాత్రమేనని జెఎసి ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన ప్రజలకు భిన్నంగా పాలన కొనసాగుతున్నందున, ఈ విషయమై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు వారు చెప్పారు.