రాష్ట్రీయం

దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో తెలంగాణ నుండి ఇద్దరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి), జూన్ 21: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవస్థానానికి 16 మంది సభ్యులతో కూడిన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దుర్గగుడికి ట్రస్ట్ బోర్డు నియామకంలో ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు చైర్మన్ పేరు ప్రకటించకుండానే ట్రస్ట్‌బోర్డును నియమిస్తూ దీనికి సంబంధించిన ఉత్తర్వులను అటు సభ్యులకు ఇటు దుర్గగుడి కార్యాలయానికి పంపారు. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు రెండు సంవత్సరాలు పాటు పదవిలో ఉంటారు. వై గౌరంగబాబు, వి శంకర్‌బాబు, బి ధర్మారావు, కె సూర్యలలితాకుమారి, ఇ సాంబశివరావు, సి సాంబ సుశీల, పి విజయశేఖర్, జి పద్మశేఖరరావు, వి పాపా, సి లక్ష్మీనరసింహారావు, రంగ ప్రసాద్, ఇ పెంచలయ్య, ఇ దుర్గా ప్రసాద్, తదితరులు ఉన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వైదిక కమిటీ సభ్యునిగా ఉన్న లింగంబొట్ల దుర్గా ప్రసాద్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా నియమించారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన రామ్‌నాథం, పి రాజాలకు ఈసారి కమిటీలో సభ్యులుగా అవకాశం లభించింది.