కృష్ణ

యువకుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, జూన్ 22: పాతకక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన కంకిపాడు సమీపంలోని చైతన్య మహిళా కళాశాల వద్ద బుధవారం రాత్రి జరిగింది. గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన షేక్ రఫీ (28) అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతితో పరిచయం పెంచుకుని మాట్లాడుతున్నాడు. ఈక్రమంలో బుధవారం ఇద్దరూ కలిసేందుకు కంకిపాడు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. రఫీ తన స్నేహితుడు షేక్ మున్నాతో కలిసి సాయంత్రం కంకిపాడు బయల్దేరాడు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతి కంకిపాడు చైతన్య టెక్నో స్కూలు సమీపంలో కలుద్దామని చెప్పడంతో అక్కడకు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతుండగా ఇక్కడే ఉన్నానంటూ ఆమె ఎదురుగా కనిపించింది. వెంటనే హఠాత్తుగా ఆటోలో నుండి దిగిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తి కత్తులతో దాడికి పాల్పడ్డారు. తప్పించుకునేందుకు రఫీ, మున్నా పారిపోయారు. గుర్తుతెలియని దుండగులు మాత్రం రఫీని వెంబడించారు. మున్నా విజయవాడ చేరుకొని బంధువులకు సమాచారం అందించాడు. వారు వెంటనే అక్కడి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు బుధవారం అర్ధరాత్రి కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలంలో గాలించగా ఆచూకీ తెలియలేదు. గురువారం మధ్యాహ్నం స్థానికుల సమాచారంతో రఫీ మృతదేహాన్ని కనుగొన్నారు. అతని చేతులు, తల భాగం నరికి దుండగులు దారుణంగా హత్య చేశారు. సంఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని డిసిపి క్రాంతిరాణా టాటా, ఎసిపి విజయభాస్కర్, సిఐ శ్రీ్ధర్‌కుమార్, ఎస్‌ఐ హనీష్ పరిశీలించారు. పోస్టుమార్టం కోసం విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం రాత్రి దాడి జరిగిన సమయంలో రఫీతో పాటు ఉన్న మున్నా ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.