విజయనగరం

ఆర్టీసీ డిపో మేనేజర్ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), జూన్ 23: ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజియన్ పరిధిలో పలువురు డిపోమేనేజర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం డిపోమేనేజర్ కె.పద్మావతిని విజయనగరం జోనల్ స్టోర్స్ పర్చేజ్ అధికారిగా, అక్కడ పనిచేస్తున్న ఆర్.రాజశేఖర్‌ను విశాఖపట్నం డిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. విశాఖపట్నం డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న గౌతం చట్టర్జీని సాలూరు డిపోమేనేజర్‌గా, అక్కడ డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న పి.శివకుమార్‌ను పలాస డిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. పలాస డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్.సిమ్మన్నను విశాఖపట్నం అర్బన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా బదిలీ చేయగా, ఎస్.కోట డిపోమేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్‌ను విజయనగరం డిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. పాడేరు డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న పిబిఎంకెరాజును ఎస్.కోట డిపోమేనేజర్‌గా బదిలీ చేయగా, విజయనగరం రీజియన్ కమర్షియల్ అసిస్టెంట్‌మేనేజర్‌గా పనిచేస్తున్న కె.రమేష్‌ను పాడేరు డిపోమేనేజర్‌గా బదిలీ చేశారు. విజయనగరం ఆర్‌ఎం కార్యాలయంలో పర్సనల్ అధికారిగా పనిచేస్తున్న ఎం.సన్యాసిరావును రమేష్ స్థానంలో నియమించారు. పార్వతీపురం డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న బివిఎస్ నాయుడిని విజయనగరం ఆర్‌ఎం కార్యాలయం పర్సనల్ అధికారిగా బదిలీ చేశారు. రావులపాలెంలో అసిస్టెంట్ డిపోమేనేజర్‌గా పనిచేస్తున్న బాబూరావుకు పదోన్నతి కల్పిస్తూ పార్వతీపురం డిపోమేనేజర్‌గా నియమించారు.