తెలంగాణ
ఐసెట్ సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 11 July 2017
హైదరాబాద్, జూలై 10: ఐసెట్ ద్వారా ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన సర్ట్ఫికేట్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. మొత్తం 32,283 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎంబిఎ 21,281 సీట్లు, ఎంసిఎ 2077 సీట్లు ఉన్నాయి. ఇంత వరకూ 21,293 మంది అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదుచేసుకున్నారని, సీట్లు తక్కువ, అభ్యర్ధులు ఎక్కువ ఉన్నందున, మంచి కాలేజీల్లో సీట్లు రావాలంటే ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలని కన్వీనర్ ఎ వాణి ప్రసాద్ తెలిపారు. ఇంత వరకూ సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరైన వారిలో ఒయు 31,654 మంది, ఎయు 312 మంది, ఎస్వీయ 166 మంది, ఇతర రాష్ట్రాల వారు 151 మంది ఉన్నారని చెప్పారు.