విజయనగరం

త్వరలో అనుబంధ కమిటీల పేర్లు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల పేర్లను త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం అశోక్‌బంగ్లాలో టిడిపి జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి జిల్లా కార్యవర్గం, అనుబంధ కమిటీలకు ఎవరెవరిని నియమించాలనే అంశంపై చాలాసేపు చర్చించారు. జిల్లా స్థాయిలో మాదిరిగానే ప్రతినెలా నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అక్కడ సమస్యలు చర్చించాలని తీర్మానించారు. బూత్ కమిటీ విధివిధానాలపై చర్చించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పార్వతీపురం డివిజన్‌లో పంటలు దెబ్బతిన్నందున దానిపై నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయాలని తీర్మానించారు. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జామి ఎంపిపి మార్పు విషయమై అధిష్ఠానం సూచించిన ప్రకారం జెంటిల్‌మెన్ ఒప్పందం ప్రకారం అక్కడ ఎంపిపి మార్పు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యేలు గీత, పతివాడ, కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, లగుడు సింహాద్రి పాల్గొన్నారు.