శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

క్షతగాత్రులకు వైద్యసేవలు అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం: పుదిచ్చేరి (పాండిచ్చేరి) వద్ద ప్రమాదానికి గురై గాయపడిన వారికి తగు వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నాయుడుపేట ఆర్డీఓ శీనానాయక్‌ను ఆదేశించారు. జిల్లాలోని సంగం మండలం తలుపులూరుపాడు గ్రామానికి చెందిన 40 మంది ప్రయాణిస్తున్న బస్సు పుదుచ్చేరికి 15 కిలోమీటర్ల సమీపంలో చెరువుకట్టపై బోల్తాపడి అందులో ప్రయాణిస్తువారు గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాయుడుపేట ఆర్డీఓ శీనానాయక్‌ను పుదుచ్చేరికి వెళ్లి గాయపడిన వారికి వైద్యసేవలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.