తెలంగాణ

లోక్‌సత్తా తెలంగాణ అధ్యక్షుడిగా రవీందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: లోక్‌సత్తా పార్టీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా నందిపేట రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ నాయకుడు నందిపేట రవీందర్‌ను మె జార్టీ జిల్లాల అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికైన అనంతరం పార్టీ నాయకులతో కలిసి పార్టీ వ్యవస్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రవీందర్ సమర్థుడైన నాయకుడని, ఆయన ఆధ్వర్యం లో పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర కార్యవర్గా న్ని ప్రకటిస్తామని రవీందర్ తెలిపారు.