రాష్ట్రీయం

సిఎం చంద్రబాబును కలిసిన సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ మహిళల బాడ్మింటన్‌షిప్‌లో రజిత పతకం సాధించినందుకు సింధుని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. సింధు మరిన్ని పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్, భారతదేశ పేరు ప్రఖ్యాతలు నిలపాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడలో మరిన్ని విజయాలు, రికార్డులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన క్రీడాకారిణి అయిన సింధుకు డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించే సత్తా ఉందంటూ ప్రశంసించారు. అమరావతి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు ఎంత వరకు వచ్చిందో కోచ్ గోపీచంద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు.