రాష్ట్రీయం

మహిషాసుర మర్దినిగా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 29: వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో అమ్మవారు శుక్రవారం మహిషాసురమర్ధినిగా భక్తులకు దర్శనమిచ్చా రు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజైన శుక్రవారం తెల్లవారుజామున నిత్యాహ్నికం నిర్వహించి భద్రకాళి మాతను మహిషాసురమర్దినిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 11గంటలకు సిద్ధ్ధిత్రీ దుర్గార్చన, మహానవమీకృత్యం, వసంతోత్సవం, చతురస్తసేవ దిగ్ధేవతా బలిప్రధానం, కూష్మాండబలి ప్రధానం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయం త్రం శుంభహాదుర్గార్చన, సర్వభూపాలసేవ జరిపారు. మహార్నవమి శుక్రవారం రావడంతో వందలాదిమంది భక్తులు తెల్లవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
శుక్రవారం భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున, ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త గట్టు మహేష్‌బాబు దంపతులు అమ్మవారికి లక్షబిల్వార్చన చేసారు.

చిత్రం..అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు