బిజినెస్
బిఎస్ఇ చైర్మన్గా సేతురత్నం రవి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 15 November 2017
న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సేతురత్నం రవి బిఎస్ఇ చైర్మన్గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన బీరేంద్ర స్వరూప్ స్థానే ఆయన ఈ పదవిని చేపట్టారు. రవి నియామకానికి సెబి ఆమోదం తెలిపిందని బిఎస్ఇ ఓ ప్రకటనలో వెల్లడించింది. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆస్తుల నిర్వహణ, కంపెనీల్లో ఇప్పటివరకు సేతురత్నం రవి ఎన్నో కీలక పదవులు నిర్వహించారని పేర్కొంది. ప్రస్తుతం ఐడిబిఐ కేపిటల్ మార్కెట్ సర్వీసులు, యుటిఐ ట్రస్టీ కంపెనీ బోర్డుల్లో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు.