ఆంధ్రప్రదేశ్‌

వైకాపా నేతలపై కేసులు బనాయిస్తున్నారు : జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తుని ఘటనకు సంబంధించి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైకాపాపై నిందలు మోపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇప్పుడు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ ఆరోపించారు. బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేసిన జగన్ ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. కాపు ఐక్యగర్జనను రైల్వేట్రాక్ పక్కన నిర్వహించేందుకు అనుమతిచ్చినవారు, లక్షలాదిమంది వచ్చినపుడు ఏమైనా జరగవచ్చన్న జాగ్రత్త లేకపోతే ఎలా అని విమర్శించారు. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టని చంద్రబాబు ఆ తరువాతి సంఘటనలకు తమను బాధ్యులను చేయడం సరికాదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం అలవాటైన బాబు ఇప్పుడుకూడా అదే చేశారని అన్నారు. కేసుల భయంతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో రాజీపడ్డారని ఆరోపించారు.