ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అనంతపురం అర్బన్, డిసెంబర్ 4: అనంతపురం నగర శివారులో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీనీ ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్ గణేష్(33), లారీ క్లీనర్ రామ్విలాస్ రావత్(27) అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి 11 గంటలకు బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అనంతపురం నగర శివారు రుద్రంపేట సమీపంలో ఎదురుగా వెళ్తున్న టమోటాల లారీని ఢీకొంది. దీంతో తమిళనాడు రాష్ట్రం తిరునే్వలి జిల్లా కొప్పనతం గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ గణేష్(33) క్యాబిన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ క్లీనర్ రామ్విలాస్ రావత్ సైతం చనిపోయాడు. బస్సు ప్రయాణికులు హర్దిక్(నల్లగొండ్ల), సంతోష్(సరూర్నగర్), శంకర్బాబు(విజయవాడ), హఫీజ్(సరూర్నగర్)కు గాయాలయ్యాయి.