రాష్ట్రీయం

మహా సంగమానికి ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: గోదావరి- పెన్నా అనుసంధానానికి ఏపీ సర్కారు ముందడుగు వేసింది. 320 టీఎంసీ గోదావరి మిగులు జలాలను పెన్నాకు తరలించే ప్రాజెక్టుకు సంబంధించి లైడార్, హైడ్రోగ్రాఫిక్ సర్వే పూర్తికాగా, జియో టెక్నికల్ అధ్యయనం ముగింపు దశకు వచ్చింది. గోదావరి- పెన్నా అనుసంధానం ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, మంచినీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం పూర్తయితే ఆరు జిల్లాల్లోని పట్టణాలకు, గ్రామాల్లోని చెరువులకు, ఇతర రిజర్వాయర్లకు గోదావరి మిగులు జలాలు తరలించవచ్చు.
గోదావరి- పెన్నా సంగమ ప్రాజెక్టుపై శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుకు వాప్‌కాస్ లిమిటెడ్ నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు పూర్తికావడానికి సుమారు రూ.80వేల కోట్ల వ్యయం కానుందని, 320 టీఎంసీ గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు 3,625 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ‘వాప్‌కాస్’ ప్రతినిధులు వివరించారు. ఈ మహత్తర పథకం పూర్తికావాలంటే 32వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, ఇందులో 7వేల ఎకరాల అటవీ భూమి ఉందని తెలిపారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్
మధ్యలో రెండు సొరంగాలు తవ్వాలని, బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మించాలని సీఎంకు వివరించారు. వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా పెదగంజాం, అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు, తర్వాత సంగం బ్యారేజ్‌కు తరలించడంపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. సత్వర ఫలితాలు సాధించేలా దశలవారీగా గోదావరి- పెన్నా అనుసంధానం పూర్తిచేయాలని, కాల్వల నిర్మాణ వ్యయం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. గోదావరి- పెన్నా అనుసంధానంలో భాగంగా మొదటి దశ కింద ప్రస్తుతం ఉన్న కాలువలు, రిజర్వాయర్ల ద్వారా వీలైనంత వేగంగా ఎంతమేర జలాలను తరలించవచ్చో అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సంగమం పూర్తయతే రాష్ట్రంలో సుమారు 1,500 టీఎంసీ వరకు జలాలను నిల్వ చేసుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
23న రాష్ట్రానికి గడ్కరీ
పోలవరం పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఈనెల 23న రాష్ట్రానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపధ్యంలో గోదావరి -పెన్నా అనుసంధానంపై సవివర ప్రాజెక్టును రూపొందించాలని ‘వాప్‌కాస్’ ప్రతినిధులకు సీఎం సూచించారు. గోదావరి- పెన్నా అనుసంధానంతో పాటు కావేరి వరకు గోదావరి జలాలను తరలించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ వివరాలతో గడ్కరీకి ప్రజంటేషన్ ఇవ్వాలని ఆదేశించారు.
కాగా పులిచింతల ప్రాజెక్టుకు 60 కి.మీ దిగువన, ప్రకాశం బ్యారేజ్‌కు 23 కి.మీ ఎగువన కొత్తగా బ్యారేజ్ నిర్మించాలని సీఎం భావిస్తున్నారు. వైకుంఠపురం దగ్గర కృష్ణానదిపై నిర్మించే ఈ బ్యారేజ్‌కు రూ.3,278.60 కోట్లు వ్యయం కానుందని అధికారులు సీఎంకి వివరించారు. దీని నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుందన్నారు. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం..గోదావరి -పెన్నా నదీ సంగమానికి సంబంధించి వాప్‌కాస్ నివేదికపై చర్చిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు