తెలంగాణ
దేవాదుల సొరంగంలో విషాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 December 2017
వెంకటాపురం (రామప్ప), డిసెంబర్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఇంచన్ చెర్వుపల్లి గ్రామంలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా కోస్టల్ కంపెనీ చేపట్టిన సొరంగంలో ఆదివారం మట్టి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం... నేపాల్కు చెందిన కార్మికులు దిలీప్ (25) బిస్టు (40) శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సొరంగం పనులు చేపడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి మట్టిపెళ్లలు కూలిపడి మృతి చెందారు. రెండుగంటల పాటు గ్రామస్థులు, సహచర కార్మికులు కలిసి మృతదేహాలను వెలికితీసారు. సంఘటన స్థలానికి డీఎస్పీ రాఘవేంద్రరెడ్డి, సీఐ సాయిరమణ, ఎస్సై శ్రీకాంత్ చేరుకుని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.