రాష్ట్రీయం
ఏసీబీకి చిక్కిన లైన్మన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 28 January 2018
హైదరాబాద్, జనవరి 27: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుంట్లూరు గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్మేన్ బి.వెంకటేశ్ 3 వేల రూపాయలు లంచం తీసుకుంటూ శనివారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. కుంట్లూరులో ఎ.రాము అనే కాంట్రాక్టర్ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించేందుకు వెంకటేశ్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో రాము ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం డబ్బు తీసుకుంటున్న సమయంలో వెంకటేశ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపారు.