రాష్ట్రీయం
విభజన చట్టంలోని హామీలను అమలుచేయాల్సిందే: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 March 2018
అమరావతి: విభజన చట్టంలోని అంశాలన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపితో కలిసి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని భావించామని తెలిపారు. ఢిల్లీలో ఏపీ ఎంపీలంతా గట్టిగా పోరాడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నా పరిస్థితులు సానుకూలంగా లేవని అన్నారు. నాలుగేళ్లుగా పనిచేశాం. కేంద్రం సానుకులంగా స్పందించకపోవటంతో ఇపుడు పోరాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పోలవరం పనులు గాడిలో పడుతున్నాయని వివరించారు.