క్రైమ్/లీగల్
బావిలో పడి విద్యార్థి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 March 2018
పత్తికొండ, మార్చి 22:స్థానిక ఏపీఆర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న మద్దికెర గ్రామానికి చెందిన తరుణ్కుమార్(13) గురువారం పాఠశాల సమీపంలోని బావిలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తండ్రి రామాంజినేయులు, తల్లి హైమావతి హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకుని బోరున విలపించారు. అయితే పాఠశాల సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు విద్యార్థులను ఉపాధ్యాయులు ఎందుకు పంపించారని తల్లిదండ్రులు ఆవేదనగా ప్రశ్నించారు. ఈ మేరకు పత్తికొండ ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.