రాష్ట్రీయం
ఒక్క ఎకరానికి నీరివ్వలేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
విజయవాడ: రాష్ట్రంలో 13లక్షల ఎకరాలకు నీరిచ్చామని నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ప్రకటన పట్ల వైసీపీ నేత ఆళ్ల నాని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదని అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రకు వస్తున్న జనాన్ని చూస్తుంటే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని అన్నారు. కృష్ణాజిల్లాలో జగన్ పాదయాత్రకు జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించిన తరువాత ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమ అధినేత జగన్ వలే ఎంపీల చేత రాజీనామా చేయించాలని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో వైసీపీ నాయకులు కోటగిరి శ్రీధర్, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు.