రాష్ట్రీయం

మహిళలు స్వశక్తితో ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: మహిళలు స్వశక్తితో పైకి ఎదిగినప్పుడే సాధికారత సాధించినట్లు అవుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్వర్యంలో జరిగిన సమావేశానికి దత్తాత్రేయ, బిజెపి నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ ప్రసంగిస్తూ మహిళా సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మంజుశ్రీ, కరుణ గోపాల్, నిర్మల, ఎన్‌ఎం రత్న, టిడిపి నాయకురాలు, సినీ నటి కవిత, విజయలక్ష్మి, వెంకటేశ్వరి, భారతి, హసీనా తదితరులకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ‘మహిళా విజయం’ ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.

చిత్రం శనివారం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్వర్యంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి దత్తాత్రేయ