తెలంగాణ
ప్రభుత్వమే బాధ్యత వహించాలి:వైకాపా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 26 October 2018
హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్పై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆయన సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్ను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్పై దాడి విషయంలో ముఖ్యమంత్రి స్పందించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అసలు ఆయనకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. దాడి చేసిన శ్రీనివాసరావు వైకాపా కార్యకర్త అని ప్రచారం చేస్తున్నారని, కాని అతను తెలుగుదేశం కార్యకర్త అని అన్నారు. జగన్కు ఏపీలో రక్షణ లేకే హైదరాబాద్కు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారని అన్నారు.