బిజినెస్

ఎయిర్ ఇండియా నుంచి ‘రెడ్ ఐ’ డొమెస్టిక్ విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, అక్టోబర్ 27 : ప్రభుత్వ రంగా విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నవంబర్ 30నుంచి రెడ్ ఐ డొమెస్టిక్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు శనివారం వెల్లడించింది. ఈ సర్వీసులను ఢిల్లీ-గోవా-్ఢల్లీ, ఢిల్లీ-కోయం బత్తూర్-్ఢల్లీ, బెంగళూరు-అహ్మదాబాద్- బెంగళూరు మార్గాల్లో సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలకే సేవలను అందించనున్నట్లు పేర్కొంది. ఈ సర్వీసులు అర్ధరాత్రి బయల్దేరే ప్రయాణికులను తెల్లవారుజామున గమ్యస్థానాలకు చేరేలా పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇలాంటి విమాన సర్వీసులు అమెరికా, యూరప్ దేశాల్లో ప్రాచుర్యం పొందాయ. తక్కువ ధరతో నడిచే సర్వీసులు ప్రయాణికులకు ప్రతిరోజు అందుబాటులో ఉండనున్నాయ.