తెలంగాణ

రాహుల్ ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒకే అబద్దాన్ని పదే పదే వల్లిస్తున్నారని అది నిజం అవుతుందనే భ్రమలో ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆయన పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు దత్తాత్రేయ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ , పి చిదంభబరం సహా అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నాయకులు అవినీతి, కుంభకోణాలలో కూరుకుపోయారని అన్నారు. ఇది మరచి ప్రభుత్వం, ప్రధానిపై తప్పుడు ఆరోపణలు పదే పదే చేస్తూ రోజుకో వీధి నాటకం ఆడటం సిగ్గుచేటని అన్నారు.