క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 November 2018
ఉప్పల్, నవంబర్ 2: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం యూసుఫ్గూడ మధురనగర్లో నివసిస్తున్న బల్లెం సాయి మనీష్ (22) ప్రైవేటు ఉద్యోగి. అతడు స్నేహితులైన ఉమేశ్, అజీత్, వెంకీతో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో గురువారం అన్నోజిగూడ సింగపూర్ టౌన్షిప్కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మేడిపల్లి సీపీఆర్ఐ మూల మలుపు వద్ద రోడ్డు డివైడర్కు ఢీకొని బొల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానిక ఆదిత్య ఆసుపత్రికి తరలించగా మనీష్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. మిగితా ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం కామినేని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు