బిజినెస్

వాటాల సమీకరణలో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో: ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) పథకం ద్వారా ప్రజల నుంచి పెద్దమొత్తంలో షేర్లు వసూలు చేసిన బ్యాంకుగా జపాన్‌కు చెందిన కార్పొరేట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంకు రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఐపీఓ ద్వారా అతిపెద్ద మొత్తంలో నిధులు సమీకరించిన రెండో సంస్ధగా సాఫ్‌బ్యాంకు గణుతికెక్కింది. సాంకేతిక పరంగా ప్రపంచ గుర్తింపు పొందిన ఈ బ్యాంకు మొబైల్ యూనిట్ కోసం బుధవారం తొలిసారిగా వాటాల (షేర్లు)ను ఆహానించగా అనూహ్య స్పందన వచ్చిందని ఆ సంస్ధకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. మొత్తం 2.65 ట్రిలియన్ యెన్‌లు (23.5 బిలియన్ డాలర్లు) సంస్ధకు సమకూరాయని ఆయన వివరించారు. 2014లో అలీబాబా పబ్లిక్ ఇస్యూకు వెళ్లగా ఆ తర్వాత ప్రజల నుంచి వాటాలు సమీకరించిన జపాన్‌కు చెందిన సంస్థల్లో అతిపెద్ద మొత్తం సమీకరణ ఇదేకావడం గమనార్హం. అయితే స్టాక్ మార్కెట్‌లో మాత్రం ఈ బ్యాంకు షేర్ విలువ గణనీయంగా తగ్గడం చర్చనీయాంశమైంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభానికి ముందు 1.463 యెన్లు ఉన్న షేర్ విలువ తర్వాత ఆరంభ ధర కింద 1.500 యెన్‌లకు పెరిగినా తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టి 14.5 శాతం తగ్గిపోయి ఐపీఓ ధర 1.282 యెన్‌ల వద్ద ముగిసింది. చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఈ పరిస్థితి నెలకొందని సాఫ్ట్‌బ్యాంకు మొబైల్ డివిజన్ సీఈవో కెన్ మియాయుచి తెలిపారు. షేర్ విలువ ఇలా దిగువన ట్రేడ్ అవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా సాఫ్ట్‌బ్యాంకు కార్పొరేషన్ ఐపీఓకు వెళ్లిన సమయం మంచిది కాదని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లు గత కొన్ని నెలలుగా క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, పైగా మొబైల్ మార్కెట్‌లో అధిక ధరలపై జపాన్‌లోని న్యాయ నిపుణులు సైతం పెదవి విరుస్తున్నారని వారంటున్నారు. బుధవారం నిక్కీ ఇండెక్స్ 0.6 శాతం తగ్గిపోగా, బ్రాడర్ టాపిక్స్ ఇండెక్స్ 04 శాతం తగ్గిందని తెలిపారు. హవాయ్‌కు చెందిన విడిభాగాలను వినియోగించకపోవడం వల్ల సాఫ్ట్ బ్యాంకుకు చెందిన మొబైళ్ల ధరలు అధికంగా ఉండే అవకాశాలున్నాయని ముదుపర్లు వెనకడుగు వేశారని రకుటెన్ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ మార్కెట్ విశే్లషకుడు మసయుకి టోషిడా తెలిపారు. కాగా మొత్తం పెట్టుబడుల్లో మూడోవంతును సాఫ్ట్‌బ్యాంకు తన మొబైల్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రజల నుంచి వాటాలు స్వీకరించేందుకు నిర్ణయించి మొత్తం 1.76 బిలియన్ షేర్లను అమ్మకానికి పెట్టి ఐపీఓ ధర 1.500 యన్‌లకు అన్ని షేర్లు విజయవంతంగా అమ్మకాలు చేసింది. 1987లో ఎన్‌టీటీ డొకోమో నెలకొల్పిన రికార్డును ఈ సందర్భంగా సాఫ్ట్‌బ్యాంకు మొబైల్ యూనిట్ అధిగమించింది. ఈ బ్యాంకు యజమాని మసయోషి సన్స్ ఈ సంస్థను జపాన్‌కు చెందిన అతిపెద్ద టెలికాం సంస్థగానూ, తర్వాత అంతర్జాతీయ హైటెక్ పెట్టుబడుల సంస్థగానూ మార్చాలన్న వ్యూహ రచన చేయడంతో ఈ బ్లాక్ బస్టర్ ఐపీఓ ఆవిష్కృతమైంది. ఇలావుండంగా ఈ సంస్థకు చెందిన సగానికి పైగా నిధులు సౌదీ అరేబియా నుంచి వచ్చిన పెట్టుబడులవి. ఐతే ఈ కార్పొరేట్ సంస్థ ఎక్కువగా ఇంగ్లాండ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇస్తాబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య జరిగిన సందర్భంగా ఈ సంస్థ పలు ఆరోపణలు ఎదుర్కొని సౌదీ నిధుల విషయంలో కష్టాల్లో పడింది. ఐతే సౌదీ అరేబియాతో తాము మంచి సంబంధాలను కొనసాగిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ యజమాని సన్ చెబుతున్నారు.
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-టీమిండియా కెప్టెన్లు టిమ్ పైన్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని, అదంతా నవ్వుకునేందుకు, హాస్యచతురత కోసమేనని ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ఆసిస్ కెప్టెన్ బ్యాటింగ్ సమయంలో ఎదురుపడిన ప్రత్యర్థి కెప్టెన్‌తో జరిగిన సంభాషణను చిలువలు పలువలు చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇరు జట్ల కెప్టెన్లు మైదానంలో చాలాసార్లు ఎదురుపడ్డారని, ఆ సందర్భంగా ఎన్నో మాటలు క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా జరిగాయే తప్ప ఇద్దరూ హద్దులు మీరి ప్రవర్తించలేదని అభిప్రాయపడ్డాడు. ఇరు జట్ల సారధులు ఆటపై ఆధిపత్యం కోసం తరచూ హాస్యస్పోరకం కోసం మాటల యుద్ధానికి దిగారని, దీనిని వాస్తవ రూపంలో సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. క్రీడాస్ఫూర్తికి అనుగుణంగా జరిగిన ఇలాంటి సంభాషణలను ఆశావహ దృక్పథంతో ఆలోచిస్తే బాగుంటుందని అన్నాడు.