బిజినెస్

సూచీల్లో నయాసాల్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 1: భారతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఆంగ్ల కొత్త సంవత్సరాదిని సానుకూల వాతావరణంలోనే ఆరంభించాయి. సెనె్సక్స్ బీఎస్సీ బెంచ్ మార్కును దాటి 186 పాయింట్లు లాభపడింది. బ్యాంకింగ్ రంగాన్ని పునరుద్ధరించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టిందన్న వార్తల నేపథ్యంలో బ్యాంకింగ్ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. 30 షేర్ల బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 36,254.57 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 47.55 పాయింట్లు లాభపడి 0.44 లాభాలతో 10,910.10 పాయింట్ల ముగిసింది. ఈక్రమంలో ఆర్థిక, టెలికాం, ఐటీ, ఆటో, పార్మా రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. కాగా సెనె్సక్స్ చార్టులో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 2.76 శాతం లాభపడి అగ్రభాగాన నిలిచాయి. తర్వాతి స్థానాల్లో 2.01 లాభాలతో హెచ్‌డీఎఫ్‌సీ, 1.38 శాతం లాభాలతో యెస్ బ్యాంకు నిలిచాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతోబాటు, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, టాటా మోటార్స్, సన్‌పార్మా, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, బజాజ్ ఆటో, మారుతీ, కోల్ ఇండియా, లార్సన్ అండ్ టర్బో, రిలయన్స్ ఇండియా లిమిటెడ్‌లు 1.3 శాతం మేర లాభాలను ఆర్జించాయి. కాగా నష్టాలను చవిచూసిన సంస్థలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఎన్టీపీసీ, ఆసియన్ పెయింట్స్, వేదాంత, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. దాదాపు 3.75 శాతంమేర ఈ సంస్థలు నష్టపోయాయి. కాగా బ్యాంకింగ్ రంగంలో నిరర్ధక ఆస్తులను తగ్గించి నష్టాల బాటలో ఉన్న బ్యాంకుల ఆర్థిక స్థితిని పునరుద్ధరించనున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడం బ్యాంకింగ్ రంగ షేర్లకు ఊతమిచ్చిందని ఆర్థిక రంగ నిపుణులు విశే్లషిస్తున్నారు.