క్రైమ్/లీగల్

ప్రియురాలి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్/అగళి, ఫిబ్రవరి 4 : ప్రియురాలిని గొంతునులిమి హత్య చేసిన కేసులో నిందితుడికి స్థానిక అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ప్రసాద్ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అగళి మండలం హనుమనపల్లికి చెందిన ఉప్పర రంగప్ప అదే మండలానికి చెందిన రాగలింగనపల్లి రంగమ్మతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. రంగమ్మ భర్తను వదిలి కుమారుడు ప్రసన్నతో వేరుగా కాపురం ఉంటోంది. అయితే రంగమ్మ, రంగప్పల నడుమ మనస్పర్థలు చోటు చేసుకోవడంతో అక్రమ సంబంధానికి ఆమె నిరాకరించింది. దీంతో గత 2017 ఏప్రిల్ 15వ తేదీన రంగప్ప ఆమె ఇంటికి వచ్చి వాగ్వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురై ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అప్పట్లో అగళి పోలీసులు హతురాలి కుమారుడు ప్రసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. సంబంధిత కేసు హిందూపురం అదనపు జిల్లా కోర్టులో విచారణకు రాగా పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు రంగప్పకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.