రాష్ట్రీయం

సిబిఐ జెడిగా నాగేశ్వరరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఒడిశా కేడర్ 1986వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వర రావు కొత్త సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన నాగేశ్వరరావు సుదీర్ఘకాలం భువనేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉన్నతాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆయన హైదరాబాద్ సిబిఐ జెడిగా పదోన్నతి పొందారు. సిఆర్‌పిఎఫ్ ఐజిగా పనిచేసిన ఆయన 2008లో కర్ణాటకలో జరిగిన అల్లర్లలో కీలక పాత్ర పోషించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడి లక్ష్మినారాయణ హయాంలో సిబిఐ దర్యాప్తు సంస్థ ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సిబిఐ కేసుల దర్యాప్తులో ముందుంటుందని, నిందితులను ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.