బిజినెస్

తగ్గిన వడ్డీ రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 4: ఆర్బీఐ రెపో రేటును మరో 0.25శాతం మేర తగ్గిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది. తాజా నిర్ణయంతో రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గుతుంది. గత 18 నెలల్లో రెపో రేటును ఆర్బీఐ సవరించడం ఇది రెండోసారి. రెపో, రివర్స్‌రేపో రేటు తగ్గడంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించడమే కాకుండా వినియోగదారులకు సరసమైన ధరలకే రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ చేసిన తీర్మానాల వల్ల రుణాలు ఇకపై మరింత చౌకగా లభ్యమవుతాయ. ధరల సూచీ ద్రవ్యోల్బణం రేటును నాలుగు శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ నిర్ణయంచింది. అందుకు అనుగుణంగానే రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గించింది. రాబోయే సార్వత్రిక ఎన్నిలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనపడుతున్నా, మార్కెట్ మరింత ఊపందుకునేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడుతాయనడంలో సందేహం లేదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షన రెండోసారి సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ, వరుసగా రెండోసారి కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా, బ్యాంకులు ఇక విరివిగా రుణాలు ఇచ్చేందుకు తగిన వాతావరణాన్ని కల్పించే విధంగా దిశగా ఆర్బీఐ కీలకమైన ముందడుగు వేసింది. గతంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.75 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ద్రవ్య పరపతి కమిటీ మొదటి సమావేశంలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6.25 శాతం వద్ద ఖరారు చేసేందుకు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా నలుగురు, ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. గత 18 నెలల్లో ద్రవ్యోల్బణం 2.19 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ నెలల్లో ఈ ద్రవ్యోల్బణం 3.2 శాతం నుంచి 3.4 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. గతంలో ద్రవ్యోల్బణం ఇదే కాలంలో 3.8 నుంచి 4.2 శాతం మధ్య నమోదు కావచ్చని ఆర్బీఐ అప్పట్లో అంచనా వేసింది. రెపో రేటు కింద వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలను వడ్డీపై తెచ్చుకుంటాయి. రివర్స్ రెపో రేటు కింద బ్యాంకుల నుంచి ఆర్బీఐ రుణాలనును తీసుకుంటుంది. అదే తరహాలో వరుసగా రెండోసారి కూడా కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ను నియమించిన ద్వారా రెండోసారి జరిగిన ద్రవ్యపరపతి మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలపై మార్కెట్ ఉదయం నుంచి ఎదురుచూసింది.
ఇలావుంటే, ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఇక వినియోగదారులకు కారు చౌకగా వస్తువులు లభ్యమవుతుందని, ఆర్బీఐ మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో రెపో రేటును 0.25 శాతం మేర పెంచగా, ఆతర్వత జరిగిన సమావేశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, శక్తికాంత దాస్ అధ్యక్షతన రెండు సార్లు సమావేశమైన పరపతి విధాన కమిటీ, వరుసగా రెండోసారి కూడా వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతవరుకు ఆరుసార్లు ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించింది. 2017 ఆగస్టు మీటింగ్‌లో ఆర్‌ర్బీఐ రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఆతర్వాత మళ్లీ రెపో రేటు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. దీని వల్ల మార్కెట్లో ఇనె్వస్ట్‌మెంట్ కార్యకలాపాలు పెరిగాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా జీడీపీ 7.4 శాతం మేర నమోదవుతుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పూర్తిగా నియంత్రణలో ఉంటుంది. జీడీపీ రేటు ముందు 7.2 శాతం ఉంటుందని ఆర్బీఐ తొలుత అంచనా వేసింది. కానీ, తన అంచనాలను మార్చుకుని 7.4 శాతానికి ఎగబాకవచ్చని పేర్కొంది.
ఎగుమతులపైనా తగ్గించండి..
ఎగుమతులపైన కూడా రెపో రేటును 0.25 శాతం మే తగ్గించాలని టిరుపూర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (టీ) బ్యాంక్‌లను కోరింది. రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పట్ల ‘టీ’ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. అదే సదుపాయాన్ని ఎగుమతులకు కూడా వర్తింప చేయాలని కోరింది.

చిత్రం.. ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యులతో కలిసి సమావేశానికి హాజరైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్