బిజినెస్

రూ. 42,000 కోట్లు కట్టాలని అర్సెలోమిట్టల్‌కు ఆదేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి వేసిన 42,000 కోట్ల రూపాయల బిడ్ మొత్తాన్ని కట్టాల్సిందిగా అర్సెలోమిట్టల్ కంపెనీని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని నేషనల్ కంపెనీ లా అపెలెట్ ట్రిబ్యూనల్ (ఎన్‌సీఏఎల్‌టీ) తెలిపింది. ఈనెల 23వ తేదీన ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఏఎల్‌టీ బెంచ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ముందే అఫిడవిట్‌ను అర్సెలోమిట్టల్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియను 23వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఎస్సార్ స్టీల్ కొనుగోలు విధానం, దానిని ఏ విధంగా పునరుద్ధరిస్తారనే విషయాలను పొందుపరుస్తూ అర్సెలోమిట్టల్ అఫిడవిట్‌ను అందచేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కి సమర్పించిన వాస్తవ ప్రణాళికను తు.చ తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని అర్సెలోమిట్టల్ కంపెనీకి స్పష్టం చేసింది.