తెలంగాణ
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 May 2019
కట్టంగూర్, మే 8: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని స్థానికసంస్థలు నిర్వీర్యమయ్యాయని, నిధులు లేక అలంకారప్రాయంగా మారిపోయాయని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ విమర్శించారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని చెర్వు అన్నారం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో స్థానికసంస్ధలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని, ఫలితంగా మండల, జిల్లా పరిషత్లు నీరసించిపోయాయన్నారు.