తెలంగాణ

నేటి సాయంత్రం నుండి ప్రచారం నిలిపేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 11: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తుదిదశ పోలింగ్ ఆదివారం సాయంత్రం ముగుస్తుంది. మంచిర్యాల, కొమురంబీం, భద్రాద్రి, ములుగు, జయశంకర భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముస్తుందని, ఇతర జిల్లాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందునుండి ప్రచారం ముగించాలని సూచించారు. ప్రచారం ఏ రూపంలో కూడా ఉండకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. నిర్ణీత గడువు మీరిన తర్వాత అన్ని రకాల ప్రచార కార్యక్రమాలను నిలిపి వేయాలని ఆదేశించారు. మీటింగ్‌లు నిర్వహించవద్దని, టీవీలలో ఏ రూపంలోని ప్రచారం నిర్వహించవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌ను అతిక్రమిసే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఏ రకమైన ప్రచార కార్యక్రమాలు మీటింగ్‌లు నిర్వహించవద్దని ఆదేశించారు.