తెలంగాణ

ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, మే 13: మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఓ వ్యక్తి కిరోసిన్ డబ్బా తీసుకువచ్చి హల్‌చల్ సృష్టించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న పోలీసులు అతడిని వారించడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. యాదయ్య అనే రైతు రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందినవాడు. అయితే తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ పలుమార్లు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే గ్రామానికి చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో కుమ్మకై తన తండ్రి పేరుపై ఉన్న రెండెకరాల 20 కుంటల భూమిని అక్రమంగా యాదిరెడ్డి భార్య పేరున రికార్డులలో చేర్పించారని అయితే తన భూమిని తనకు ఇవ్వాలంటూ ఎన్నోమార్లు తహశీల్దార్ కార్యాలయం ముందు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం మహబూబ్‌నగర్‌లోని కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. తన భూమిని ఇప్పించకపోతే తాను చనిపోవడానికి కూడా సిద్ధమని పేర్కొన్నాడు. గ్రామంలో పూరిగుడిసెల్లో నివాసం ఉంటున్న తమకు ఆర్థికంగా ఏమీలేదని తమ పెద్దలు సంపాదించిన భూమిని అక్రమార్కులు కబ్జా చేశారని అధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
చిత్రం... కలెక్టరేట్ ఆవరణలో కిరోసిన్ ఒంటిపై పోసుకుంటున్న రైతు యాదయ్య