తెలంగాణ

కర్గిస్తాన్ మాస్ మీడియా ఫోరానికి పీఐబీ ఏడీజీ టీవీకే రెడ్డి ప్రాతినిథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ దేశాల రెండో మాస్ మీడియా ఫోరంలో పాల్గొనేందుకు భారత్ ప్రతినిధిగా సమాచార మంత్రిత్వశాఖ తెలంగాణ ప్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డిని కేంద్రప్రభుత్వం నామినేట్ చేసింది. రెండో మాస్ మీడియా ఫోరం ఈ నెల 23 నుండి 26 వరకూ కర్గిస్తాన్ బిష్కెక్‌లో నిర్వహించనుంది. ఈ సందర్భంగా షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ అభివృద్ధిలో మాస్ మీడియా పాత్రపై చర్చ జరగనుంది. ప్రపంచ సమాచార రంగంలో ఎస్‌సీఓ విజన్ పట్ల సకారాత్మక కార్యాచరణను చేపట్టనున్నారు. తొలి మీడియా సమ్మిట్ బీజీంగ్‌లో జరిగింది. తొలి సదస్సులో 16 దేశాలకు చెందిన 110కి పైగా మీడియా సంస్థలు పాల్గొన్నాయి.