తెలంగాణ

కాంగ్రెస్‌ను నమ్మేస్థితిలో జనం లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: తుది విడత ఎన్నికలు పూర్తి కాకుండానే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ, నరేంద్రమోదీ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు ప్రాంతీయ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎవ రు ఉన్నా అభ్యంతరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించడం కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకీ దిగజారి దయనీంగా మారుతోందన్నారు. నిన్నటి వరకు బీజేపీకి టీఆర్‌ఎస్ బీ టీం మాదిరిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించి, ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేపట్టడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని విమర్శిస్తూనే, కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం కల్తీలేని నాణ్యమైన విత్తనాలను సిద్ధం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలిస మధు సూధన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.