క్రైమ్/లీగల్
యజమాని దృష్టి మళ్లించి చీరలను దొంగిలించిన గుర్తు తెలియని మహిళలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఘట్కేసర్, జూన్ 26: యజమాని దృష్టి మళ్లించిన గుర్తు తెలియని మహిళా దొంగలు విలువైన చీరలను దొంగిలించుకు పోయిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి వెంకటాద్రి టౌన్షిప్లో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చౌదరిగూడ పంచాయతీ ఓ యు కాలనీలోని హెల్లో బ్యూటిపుల్ ఉమెన్స్ క్లాత్ స్టోర్స్కు బుధవారం ఉదయం గుర్తు తెలియని ఓ వ్యక్తి, మరో ముగ్గురు మహిళలు కలిసి చీరలు కొనేందుకు వచ్చినట్లు తెలిపారు. షాపు యజమాని ఈరి సాంబయ్య భార్య దృష్టి మళ్లించి షాపులోని రూ.18000 విలువ గల 40 చీరలను దొంగిలించుకు పోయినట్లు తెలిపారు. దొంగలు వెళ్లిన తర్వాత దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని ఈరి సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్స్పెక్టర్ రఘువీర్రెడ్డి తెలిపారు.