క్రైమ్/లీగల్

తహశీల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలువాయి, ఆగస్టు 28 : నెల్లూరు జిల్లా కలువాయి తహశీల్దారు కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ దేవానంద్ సన్స్ బుధవారం దాడి చేశారు. మండలంలో తుళ్లూరు గ్రామానికి చెందిన ముకుంద అనే వ్యక్తి తన పొలానికి సంబంధించిన పాసు పుస్తకాలు ఇప్పించాలని గత కొంత కాలంగా తుళ్లూరు విఆర్‌వో పోలయ్యను అడుగుతున్నాడు. అయితే పాసు పుస్తకం ఇవ్వాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలని వీ ఆర్వో డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చెప్పి ముకుంద రూ.10 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముకుంద అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా బుధవారం దాడి చేసి విఆర్‌వోను పట్టుకున్నారు. ఈ దాడిలో రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న పోలయ్య పట్టుపడినట్లు డీ ఎస్పీ తెలిపారు. ఆయనతో పాటు సీ ఐ రమేష్‌బాబు, సిబ్బంది ఉన్నారు.