క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, సెప్టెంబర్ 10 : నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి - పెనుబర్తి గ్రామాల మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రాపూరు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాపూరుకు చెందిన షేక్ నౌషాద్ (22), అశోక్ (23), అబ్దుల్ అజీజ్ (18), ఎస్‌కె మస్తాన్ అనే నలుగురు యువకులు సోమవారం రాత్రి ఓబులాపల్లి గ్రామంలో జరిగే మొహర్రం పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. అనంతరం అదే ద్విచక్ర వాహనంలో పెంచలకోనకు వెళ్లి తిరిగి రాపూరుకు బయలుదేరారు. ఈక్రమంలో గోనుపల్లి - పెనుబర్తి గ్రామాల మధ్యలోని ఓ మలుపు వద్ద ఈ నలుగురితో వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మస్తాన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ఆర్తనాదాలతో మంగళవారం ఉదయం అటుగా వెళ్లే కొందరు గుర్తించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన 108 వాహన సిబ్బంది తీవ్రంగా గాయపడ్డ షేక్ మస్తాన్‌ను రాపూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. కాగా దుర్మణంపాలైన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు కాగా మరో వ్యక్తి స్నేహితుడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పంచనామా నిమిత్తం రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా తెలిపారు.