బిజినెస్
బంగారు నాణేలు, పెండెంట్ల ఎగుమతిదారులకు రాయితీలు రద్దు : డీజీఎఫ్టీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 September 2019
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: బంగారం డాలర్లు, పెండెట్లు, నాణేల ఎగుమతిదారులకు ఇస్తున్న రాయితీలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే బంగారు నాణేలు, డాలర్ల తయారీకి అవసరమైన మెటీరియల్ దిగుమతిపై సైతం రాయితీలను సైతం ఉపసంహరించుకుంది. పూర్తి యాంత్రీకరణ విధానం ద్వారా తయారు చేసే బంగారు పతకాలు, డాలర్లు, నాణేలు, ఆభరణాలు లేదా వస్తువులకు సంబంధించి సుంకాల రహిత ఎగుమతి, దిగుమతుల కోసం ఇకపై ఎలాంటి ముందస్తు సాధికారత ఇవ్వడం జరగదని విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) తెలిపింది.