తెలంగాణ
ఎమ్మెల్సీ పోచంపల్లికి కేటీఆర్ అభినందనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, అక్టోబర్ 25: హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజారిటీ సాధించినందుకు అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. శ్రీనివాసరెడ్డి బాగా కష్టపడ్డారని, అందుకే మంచి మెజారిటీ వచ్చిందని ఆయన అభినందించారు. ప్రత్యర్థులకు అందకుండా అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం సాధించారన్నారు. నేరేడుచర్ల టౌన్ ఇన్నికల ఇన్చార్జీలుగా వ్యవహరించి మంచి మెజారిటీ తీసుకువచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ను కేటీఆర్ అభినందించారు.
సైదిరెడ్డి విజయానికి అద్భుతంగా పనిచేసి కాంగ్రెస్ కంచుకోట అయిన నేరెడుచర్లలో మెజారిటీ సాధించేందుకు పనిచేసిన పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు.