తెలంగాణ

ప్రజలకు మోసపూరిత హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: హుజూర్‌నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు విమర్శించారు. తమ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతగా టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలా కనపడలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్, తాజాగా మరి కొన్ని హామీలను ప్రజలకు ఇచ్చారన్నారు. కేసీఆర్ హామీల్లో విశ్వసనీయత లేదన్నారు. గత ఆరు సంవత్సరాల్లో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు, ప్రతి మండలానికి రూ.30 లక్షల నిధులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇటువంటి హామీలను ప్రజలు విశ్వసించరన్నారు.