బిజినెస్

ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఆంధ్రాబ్యాంకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను ఘనంగా నిర్వహించింది. శుక్రవారం ఇక్కడ శ్రీ సత్యసాయి నిగమాగమంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఏవైవీ కృష్ణ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉద్యోగులు చట్టాలకు అనుగుణంగా విధేయతగా నడుచుకోవాలని సూ చించారు.
ప్రతి ఉద్యోగి తనకు అప్పగించిన విధులను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. ఆంధ్రాబ్యాంకు ఎండీ జే పాక్సిరిసామి మాట్లాడుతూ బ్యాంకులో అమలు చేస్తున్న విజిలెన్స్ విధానాలను, బ్యాంకు ప్రగతిని వివరించారు. విధి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనంతో ఉండాలన్నారు. రాజధానిలోని 200 పాఠశాలలకు చెందిన విద్యార్థులు , ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేబీ జైన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఏ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.