తెలంగాణ
ప్రభుత్వం కళ్లు తెరవాలి.. యూనియన్ నేతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 November 2019
హైకోర్టులో ఆర్టీసీ ఎండీ వాదనలపై ఆర్టీసీ కార్మికుల జాక్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ గురించి మాట్లాడకుండా జీహెచ్ఎంసీ ఇబ్బందుల్లో ఉం దని చెప్పడం విడ్డూరమని కార్మిక సంఘాల జాక్ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో వాదనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభు త్వం కళ్లు తెరవాలని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఐఏఎస్ లు ప్రభుత్వం చెప్పింది రాసుకొచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం దిగిరావాలన్నారు. ప్ర భుత్వం నుండి రావాల్సిన రూ.665 కోట్ల బకాయిలు వ చ్చేశాయని అధికారులు చెప్పడం విడ్డూరమని అన్నారు.