తెలంగాణ

ఖమ్మంలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: జిల్లాలో సత్తుపల్లి కేంద్రంగా సాగుతున్న దొంగనోట్ల ముఠా గుట్టును రట్టు చేశారు. దాదాపు రూ.7కోట్ల విలువ చేసే నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతూ అమాయకులకు డబ్బు ఆశ చూపి ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నకిలీ నోట్లను చెలామణి చేస్తుందని అన్నారు. ఇప్పటివరకు ఐదుగురుని అరెస్టు చేశామని, మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. నిందితుల నుంచి నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను విచారిస్తే మరిన్ని వివరాలు రావచ్చని, ఎవరెవరు మోసపోయారో తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా ఈ ముఠాకు పాత నేరస్థుడైన మదార్‌మియా కీలక సూత్రదారిగా గుర్తించామని తెలిపారు.