తెలంగాణ
డీఏపై జీవో విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 November 2019
హైదరాబాద్, నవంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ ఇస్తామని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం బుధవారం జీఓ (ఎంఎస్ నెంబర్ 88, ఆర్థిక శాఖ) జారీ చేసింది. జనవరి 1 నుండి డీఏ వర్తిస్తుందని వివరించారు. డీఏ 3.144 శాతం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల బేసిక్లో 30.392 శాతం ఉన్న డీఏ ఇక నుండి కొత్త జీఓతో 33.536 శాతానికి పెరుగుతుంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు పేరుతో జీఓ జారీ అయింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్థానిక సంస్థలు, కార్పోరేషన్లు, ఎయిడెడ్ విద్యాసంస్థలు తదితర ఉద్యోగులందరికీ పెరిగిన డీఏ వర్తిస్తుందని జీఓలో వివరించారు.