తెలంగాణ

తహశీల్దార్ హత్యకేసు నిందితుడు సురేశ్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మేట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు కూర సురేశ్ చికిత్స పొందుతూ ఉస్మానియా ఆసుపత్రిలో చనిపోయాడు. దాదాపు 60 శాతం గాయాలతో తొలుత అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. తదనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మధ్యాహ్నాం 3.30 గంటలకు మృతిచెందాడని వైద్యులు వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై కూర సురేశ్ పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. భోజన విరామ సమయంలో కూర సురేశ్ తహశీల్దార్ గదిలోకి వెళ్లాడు. అనంతరం కాసేపటికి విజయారెడ్డి మంటలతో అరుచుకుంటూ బయటకు వచ్చారు. ఆమెను కాపాడేందుకు ఇద్దరు సిబ్బంది ప్రయత్నించినా వారికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన కూర సురేశ్ మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అతను పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయన విషయం విదితమే.