తెలంగాణ

సీఎం చర్చలకు పిలిస్తే సమ్మెకు పరిష్కారం:అశ్వత్థామరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ చర్చలకు పిలిస్తే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, సీఎం కేసీఆర్ 9 గంటల పాటు అధికారులతో సమీక్ష చేసే బదులు 90 నిమిషాలు తమతో చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈనెల 9న జరిగే మిలినియం మార్చ్‌కు తరలిరావాలని ఆయన కార్మికులను కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.