తెలంగాణ
పసుపు బోర్డు ఏర్పాటు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 November 2019
హైదరాబాద్, నవంబర్ 9: నిజమాబాద్లో తొందరగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్రెడ్డిని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి కోరారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన మెల్బోర్న్లో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సుంకాలను, పన్నులను మాఫీ చేయాలని కాసర్ల కోరారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం పొందుపరిచిన హామీలను నెరవేర్చేదిశగా కేంద్రం ప్రయత్నించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కాసర్లతో పాటు సాయిరాం ఉప్పు, సాయి యాదవ్, రామకృష్ణ ధ్యావనపల్లి, అరుణ్రెడ్డి తదితరులున్నారు.